లాక్‌డౌన్ వేళ‌.. మెట్టినింటికి రానంటున్న భార్య.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన భ‌ర్త‌

క‌రోనా వైర‌స్ మ‌హమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చాలామంది ఆయా ఊర్ల‌లో చిక్కుకుపోయారు. ర‌వాణా సౌక‌ర్య‌లు అందుబాటులో లేక‌పోవ‌డంతోపాటు, ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఇళ్ల‌ల్లోనే ప్రజలు ఉండిపోతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ భ‌ర్త.. మెట్టినింటికి రానంటోంద‌ని తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. లాక్‌డౌన్‌కు ముందు పుట్టినింటికి వెళ్లిన భార్య‌.. ప్ర‌స్తుతం తన ఇంటికి రానంటోంద‌ని ఫిర్యాదు చేశాడు.

Must Read:

రాష్ట్రంలోని సంభాల్ ప్రాంతంలో నివ‌సించే వ్య‌క్తికి కొన్ని నెల‌ల కింద‌ట వివాహ‌మైంది. అయితే పెళ్లైన కొద్ది రోజుల‌కే భార్య పుట్టింటికి వెళ్లింది. ఈలోగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఆమె అక్క‌డే చిక్కుకుపోయింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ముగిశాక ఇంటికి వ‌స్తాన‌ని భ‌ర్త‌కు స‌మాచార‌మిచ్చింది. అయితే దీనిపై భ‌ర్త అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. త‌న ఊరికి వ‌చ్చేందుకు పాస్‌ను ఇప్పిస్తాన‌ని చెప్ప‌గా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌య‌ట తిరిగితే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని భార్య పేర్కొంది. పుట్టినింట్లోనే ఉంటాన‌ని తెలిపింది.

Must Read:

ఇక భ‌ర్త కోరిక మేర‌కు త‌ల్లిదండ్రులు న‌చ్చ‌జెప్పినా ఆమె ప్ర‌యాణానికి నిరాక‌రించింది. దీంతో ఆ భ‌ర్త పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఫిర్యాదును ప‌రిశీలించిన పోలీసులు.. లాక్‌డౌన్ ముగిసేవ‌ర‌కు ఆమె త‌న పుట్టింట్లోనే ఉంటుంద‌ని స‌ద‌రు వ్య‌క్తికి తేల్చిచెప్పారు. దీంతో భ‌ర్త ఏం చేయాలో పాలుపోక ఉసూరుమ‌న్నాడు. మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1790కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. 29 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here