400 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ‘పుష్ప 2’ మేకర్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా.. ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం సాధించింది ఈ సినిమా. ముఖ్యంగా హిందీలో 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటికే బాలీవుడ్లో బన్నీకి అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఇంతకు ముందు యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్.. మొదటిసారి థియేటర్లలో దండయాత్ర చేశారు. అలాగే కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. పైగా ఇంటర్నేషనల్ క్రికెటర్స్, ఫేమస్ పర్సనాలిటీస్ ఎంతో మంది పుష్ప సినిమాలోని పాటలకు రీల్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.
ఈ రికార్డుల పర్వం చూసిన తర్వాత పుష్ప 2 కోసం ఒక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏకంగా 400 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అది కూడా కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనం. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో 400 కోట్ల ఆఫర్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వదులుకున్నారు. సినిమా విడుదలకు ఇన్ని నెలల ముందే 400 కోట్ల ఆఫర్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఐకాన్ స్టార్ మార్కెట్ కు ఇది నిదర్శనం. రెండో భాగం అంతకంటే అద్భుతంగా వస్తుందని దర్శకుడు సుకుమార్ నమ్మకంగా చెబుతున్నారు. సినిమాపై ఉన్న అన్ని అంశాలు అందుకుంటామని ఆయన ధీమాగా ఉన్నారు. విజయంపై అంత నమ్మకం ఉంది కాబట్టే అన్ని వందల కోట్ల ఆఫర్ కూడా వదిలేసుకున్నారు నిర్మాతలు. పుష్ప 2కు వచ్చిన ఆఫర్ గురించి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here