సరిహద్దులు దాటిస్తాం.. ఆ 3.5 లక్షల మందిని తీసుకెళ్లండి: ఆరు రాష్ట్రాలకు మహారాష్ట్ర విజ్ఞ‌ప్తి

తమ రాష్ట్రంలో చిక్కుకున్న 3.5 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలకు తీసుకెళ్లేందుకు సంబంధిత రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరింది. నాందేడ్‌లోని తఖ్త్ శ్రీ హుజూర్ సాహెబ్‌ను దర్శించుకోడానికి మార్చి 23న పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుంచి 3,800 మంది యాత్రికులు రాగా.. ఆ మర్నాడు నుంచే లాక్‌డౌన్ విధించడంతో అక్కడ చిక్కుకున్నారు. దీంతో వారిని తమ రాష్ట్రానికి తరలించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో 100 మంది యాత్రికులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు.

ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లకు చెందిన మూడున్నర లక్షల మంది వలస కార్మికులు తమ రాష్ట్రంలో చిక్కుకున్నారని, వారిని తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్రాలు ముందుకు రావాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మెహతా శనివారం కోరారు.

వీరిని రాష్ట్రాల సరిహద్దుల వరకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో చిక్కున్న కశ్మీర్, ఉత్తరప్రదేశ్ పౌరులను హిమాచల్‌ప్రదేశ్, హర్యానాలు శనివారం వెనక్కు పంపాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీకి చెందిన 3,800 నాందేడ్‌లో చిక్కుకోవడంతో తమ పౌరుల కోసం పంజాబ్ ప్రభుత్వం 80 ప్రత్యేక బస్సులను శనివారం పంపింది. ఇవి ఆదివారం సాయంత్రానికి నాందేడ్ చేరుకున్నాయి. ఒక్కో బస్సుకు ముగ్గురు డ్రైవర్లు, ఒక కండక్టర్, ఒక పోలీస్‌ను నియమించారు.

మిగతా రాష్ట్రాలు కూడా అంగీకరిస్తే వలస కార్మికులను వారి సరిహద్దులకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇదే అంశాన్ని అజయ్ మెహతా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి చర్చించినా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఏప్రిల్ 15న రెండో విడత లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత 1,500పైగా వలస కూలీలు బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వం తమ పౌరులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ వచ్చినవారినే పంపుతారు. 52 మంది ప్రయాణించే బస్సులో 35 మందికి మాత్రమే అనుమతిస్తారు. 3,800 మంది యాత్రికులను తరలించడానికి 100 బస్సులు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ వచ్చినవారినే బస్సుల్లోకి అనుమతిస్తారు. అనంతరం స్వరాష్ట్రాలకు చేరిన తర్వాత 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here