అమెరికాలో 50 వేలు దాటిన కరోనా మరణాలు.. పది రోజుల్లోనే పిట్టల్లా రాలిన జనం

దెబ్బకు విలవిల్లాడుతున్న అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా ప్రాణ నష్టం 50 వేలు దాటిందని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు దాటగా.. ఒక్క అమెరికాలోనే దాదాపు 9 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తం కరోనా మరణాల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. ఈ లెక్కన చూస్తే.. ప్రపంచంలోని కోవిడ్ మరణాల్లో నాలుగోవంతు అమెరికాలోనే నమోదయ్యాయని చెప్పొచ్చు.

ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అమెరికాలో రోజుకు సగటున 2 వేల మంది చొప్పున కరోనాకు బలయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 24 నాటికి అమెరికాలో 52,690 కేసులు నమోదు కాగా.. 681 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 14న అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 25 వేలు దాటింది. ఈ పది రోజుల్లో దాదాపు 3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌ల్లో మరణించిన వారినే పరిగణనలోకి తీసుకున్నారని.. ఇళ్ల వద్ద చనిపోయిన వారిని కూడా కలిపితే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఏప్రిల్ 23 నాటికి ఒక్క న్యూయార్క్ స్టేట్‌లోనే 2.63 లక్షల మంది కోవిడ్ బారిన పడగా… 15,740 మంది చనిపోయారు. న్యూజెర్సీలో లక్ష కరోనా కేసులను గుర్తించగా.. 5368 మంది చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల తర్వాత మసాచూసెట్స్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here