ప్ర‌ధాని నరేంద్ర మోదీ ‘రంజాన్’ శుభాకాంక్ష‌లు

శుక్ర‌వారం సాయంత్రం దేశ‌వ్యాప్తంగా నెల‌వంక క‌న్పించ‌డంతో ప‌విత్ర‌మైన మాసం ప్రారంభ‌మైంది. శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచి ముస్లింలు రంజాన్ ఉప‌వాసాలు చేయ‌నున్నారు. రంజాన్ మాసం ప్రారంభ‌మైన క్ర‌మంలో దేశ‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికి రంజాన్ ముబారక్ చెప్పిన మోదీ.. అంద‌రి క్షేమాన్ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు. ప‌విత్ర‌మాసంలో అంద‌రికీ ద‌య‌, సామ‌ర‌స్యం, క‌రుణతో ఉండాలని కోరుకున్నారు.

Must Read:

ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌పై చేస్తున్న పోరాటంలో విజ‌యం క‌ల‌గాల‌ని మోదీ ఆకాంక్షించారు. మ‌నం మ‌రింత ఆరోగ్య‌వంతులం కావాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు శుక్ర‌వారం సాయంత్రం ల‌క్నోలోని సున్నీ, షియా క‌మిటీలు నెల‌వంక క‌న్పించ‌డాన్ని స్ప‌ష్టం చేశాయి. ఈక్ర‌మంలో దేశంలో శ‌నివారం నుంచి ఉప‌వాసాలు ప్రారంభ‌మ‌వుతాయి.

Must Read:

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా రంజాన్ మాసంలో తెల్ల‌వారుజాము నుంచి సాయంత్రం వ‌ర‌కు ముస్లింలు ఉప‌వాసంను పాటిస్తారు. అలాగే త‌రావీ న‌మాజుల పేరిట రాత్రిపూట ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు కూడా జ‌రుపుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here