గుడ్‌న్యూస్‌.. ఢిల్లీ జ‌ర్న‌లిస్టుల‌కు కరోనా సోకలేదు

ఈనెల 22న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం తెలిపింది. దాదాపు 160 మంది జ‌ర్న‌లిస్టుల‌ను క‌రోనా అనుమానంతో క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈక్రమంలోనే ఢిల్లీ ప్ర‌భుత్వం తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. తాజాగా విడుదలైన ఫ‌లితాల్లో నెగిటివ్‌గా తేలింద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. క్వారంటైన్‌లో గ‌డ‌పుతున్న మీడియా ప్ర‌తినిథుల్లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ విభాగాలకు చెందిన‌ జ‌ర్న‌లిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, కెమేరామెన్లు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

Must Read:

మ‌రోవైపు దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌రకు దేశ‌వ్యాప్తంగా 25,200కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. 770 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ‌వ్యాప్తంగా 6,800కుపైగా కేసులతో మ‌హారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. గుజ‌రాత్ (2,800), ఢిల్లీ (2,300), రాజ‌స్థాన్ (2000), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (1,800), త‌మిళ‌నాడు (1700), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (1600) రాష్ట్రాలు వెయ్యికిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల జాబితాలో చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here