కరోనా టెర్రర్.. నాలుగు నెలల చిన్నారి బలి

ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ దేశ‌మంతా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ మ‌హమ్మారి కార‌ణంగా కేర‌ళ‌లో నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెందింది. కేవ‌లం రెండు రోజుల కింద‌టే క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఈ చిన్నారి.. చికిత్స అందిస్తుండగానే మృత్యువాత ప‌డింది. గుండె జ‌బ్బుతోపాటు మ‌రికొన్ని వ్యాధుల‌తో చిన్నారి బాధ‌ప‌డుతోందని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ తెలిపారు. అయితే చిన్నారికి క‌రోనా ఎలా సోకిందో అంతుబ‌ట్ట‌డం లేద‌ని పేర్కొన్నారు.

Must Read:

కోజికోడ్ మెడిక‌ల్ క‌ళాశాల‌లో నాలుగు నెల‌ల చిన్నారికి చికిత్స అందిస్తుండ‌గా మృతి చెందింద‌ని విజ‌యన్ అన్నారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యుల‌తోపాటు నర్సులు, తల్లిదండ్రుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రోవైపు మూడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.

Must Read:

రాష్ట్రంలో ఇప్పటివ‌ర‌కు 450క‌ిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 331 మంది కోలుకున్నారు. 116 మందికి చికిత్స అందిస్తున్నారు. నలుగురు మ‌ర‌ణించారు. ఇక విదేశాల్లో మృతి చెందిన కేర‌ళ వాసుల మృత‌దేహాల‌ను వెన‌క్కి తెచ్చేందుకు అనుమ‌తివ్వాల‌ని కేంద్రాన్ని తాజాగా సీఎం విజ‌య‌న్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here