సియోల్ లో జరుగుతున్న విక్టర్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో తెలుగు తేజం పీవీ సింధూ జపాన్ కి చెందిన నజోమి మీద గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. మొదటి సెట్ నుంచే ఫుల్ జోష్ తో కనపడిన సింధూ 22 20 తేడా తో గెలిచి రెండో సెట్ లో ఓడిపోయింది. కీలకమైన మూడో సెట్టు లోనే తన ప్రతిభ చాటుకుని నాల్గవ సెట్ వరకూ మ్యాచ్ ని తీసుకురాలేదు. మూడో సెట్ చాలా హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్టు సాగింది కానీ సింధూ కాసేపటికే తేరుకుని 21 18 తో గెలుపు సాధించింది. ఈ మధ్యన వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఒకుహోరా తో ఆమె ఓడిపోయింది దీనికి సూపర్ రివెంజ్ అంటూ అందరూ ఆమెని పోగుడుతున్నారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచీ వీరేంద్ర సెహ్వాగ్ వరకూ అందరూ ట్విట్టర్ లో తమ ట్వీట్ లు పోస్ట్ చేస్తున్నారు.