కరోనా సంక్షోభంలో మోదీ పనితీరు భేష్.. విశ్వాసం వ్యక్తం చేసిన 93.5 శాతం మంది

భారత్‌లో నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా, దేశంలో కరోనా వైరస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గురువారం విడుదలైన ఓ సర్వేలో దేశంలోని 93.5 శాతం మంది ప్రజలు మోదీపై విశ్వాసం వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా తొలుత 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ కేంద్రం విధించింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి దశ లాక్‌డౌన్ కొనసాగింది. తర్వాత దీనిని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఐఏఎన్‌ఎస్- సి- ఓటర్ కొవిడ్ 19 ట్రాకర్ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌ ప్రారంభమైన తొలి రోజు మోదీ ప్రభుత్వంపై 78.6 శాతం ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి చేరింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21 వరకు నిర్వహించిన ఈ సర్వేలో.. ‘కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటోందని నేను నేను భావిస్తున్నా’ అన్న ప్రతిచయనాన్ని ప్రజల ముందుంచి వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఏప్రిల్ 16న 75.8 శాతం ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. కానీ, దేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి మద్దతిచ్చే వారి శాతం ఒక్కసారిగా పెరిగింది. మార్చి 31 నాటికి 79.4 శాతం మంది కేంద్రం పనితీరుకు మద్దతు తెలిపితే… ఒక్క రోజులోనే ఇది 10.5 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 1 నాటికి 89.9 మంది మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

అటు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు

ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన గేట్స్..

తీసుకుంటున్న చర్యలను శ్లాఘించారు. కోవిడ్-19ను కట్టడి చేయడం కోసం భారత సర్కారు అద్భుతంగా పని చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం, హాట్‌స్పాట్‌లలో టెస్టుల సంఖ్యను పెంచడం, ఐసోలేషన్, క్వారంటైన్‌లలో ఉంచడం, ఆరోగ్య రంగంపై ఖర్చు పెంచడం తదితర చర్యలకు బిల్ గేట్స్ కితాబిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here