లాక్‌డౌన్‌లోనూ వ్యభిచారం దందా.. ఇద్దరు యువతులతో పట్టుబడ్డ విటుడు

లాక్‌డౌన్‌ సమయంలో అన్ని వ్యాపారాలు మూతపడితే వ్యభిచార నిర్వాహకులు మాత్రం తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. కరోనా కట్టడి చేయాలంటే మనషుల మధ్య భౌతిక దూరం పాటించాలని డాక్టర్లు చెబుతుంటే వ్యభిచార నిర్వాహకులు మాత్రం మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తూ సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను చేధించిన పోలీసులు మహిళా బ్రోకర్‌తో పాటు ఇద్దరు సెక్స్‌వర్కర్లు, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

బిలాస్‌పూర్‌లోని ఖమ్‌తరై ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఏఎస్పీ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు పక్కా పథకం వేశారు. ఓ పోలీసును విటుడిగా లోనికి పంపారు. అక్కడికి వెళ్లాక అమ్మాయిని ఎంపిక చేసుకుని లోనికి వెళ్లిన పోలీసు అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీస్ టీమ్ ఆ ఇంట్లో రైడ్ నిర్వహించి మహిళా బ్రోకర్‌ను అరెస్ట్ చేసింది. ఓ గదిలో ఇద్దరు యువతులతో అసభ్యకరంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

పట్టుబడిన సెక్ష్‌వర్కర్ చంతిదిహ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. మహిళా బ్రోకర్ వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఐదేళ్లుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు స్కూటీలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో దేశంలోనే అనేక రెడ్‌లైట్ ఏరియాలకు చెందిన సెక్స్‌వర్కర్లే వ్యభిచారానిక విరామం ప్రకటిస్తే.. ఇలా ఇళ్ల మధ్యే గుట్టుగా సెక్స్ దందా కొనసాగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here