క‌రోనా గుడ్‌న్యూస్‌.. భార‌త్‌లో మూడు వారాల్లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి!

ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ను భార‌త్‌లో మూడు వారాల త‌ర్వాత నుంచి ప్రారంభిస్తామ‌ని ప్ర‌ముఖ సంస్థ సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తాజాగా తెలిపింది. యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ తాజాగా వ్యాక్సిన్ త‌యారు చేసి, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతమైతే మూడు వారాల త‌ర్వాత‌ పుణే ప్లాంట్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేప‌డ‌తామ‌ని తెలిపింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీతో వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి సంబంధించి ఎస్ఐఐకి భాగ‌స్వామ్య‌ముంది. త‌మ ప్ర‌తినిధులు వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లతో ట‌చ్‌లో ఉన్నార‌ని సంస్థ తెలిపింది.

Must Read:

ట్ర‌య‌ల్స్ అనంత‌రం అన్ని ర‌కాల ఆమోదాలు ల‌భించిన త‌ర్వాత నెల‌కు ఐదు ల‌క్ష‌ల డోసులు చొప్పున తొలి ఆరునెల‌లు ఉత్ప‌త్తి చేప‌డతామ‌ని ఎస్ఐఐ సీఈఓ అధార్ పూనావాలా తెలిపారు. అనంత‌రం ఉత్ప‌త్తిని నెల‌కు మిలియ‌న్ డోసుల‌కు పెంచుతామ‌ని పేర్కొన్నారు. దీంతో వ‌చ్చే సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లోకెల్లా మార్కెట్‌లోకి వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని వెల్ల‌డించారు.

Must Read:

ఇక ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంట్ నెల‌కొల్పాంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో పుణే ప్లాంట్‌లోనే వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి చేస్తామ‌ని పూనావాలా తెలిపారు. తాము ఉత్ప‌త్తి చేయ‌బోయే వ్యాక్సిన్‌కు పేటెంట్ కోర‌బోమ‌ని, వీలైనంత ఎక్కువ ఉత్ప‌త్తి జ‌రిగితేనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అంద‌రికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here