4 నెలల బిడ్డకి చనుబాలు ఇవ్వనన్న తల్లి.. దారుణ హత్య

నాలుగు నెలల చంటిబిడ్డకు పాలిచ్చేందుకు నిరాకరించిందన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని జిల్లాలో జరిగింది. జిల్లాలోని బిత్తూర్ ప్రాంతానికి చెందిన మహేంద్ర, పూజ(21) భార్యాభర్తలు. వారి నాలుగు నెలల చంటిబిడ్డకు చనుబాలు ఇచ్చేందుకు భార్య నిరాకరించింది.

ఆ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ చినికిచినికి పెద్దదై ఆగ్రహం చెందిన మహేంద్ర భార్యని తీవ్రంగా కొట్టి గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here