మాకంటే ఎక్కువ తింటున్నావ్.. తోటికూలీకి వేధింపులు.. చివరికి..

పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వలసొచ్చారు. విభేదాలతో ప్రాణాలు తీసుకున్నారు. పనిలో చురుగ్గా లేవంటూ హేళన చేయడం.. మాకంటే ఎక్కువ తింటున్నావంటూ వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన కూలీ దారుణానికి ఒడిగట్టాడు. తోటికూలీలపై ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులోని జిల్లాలో జరిగింది.

అస్సాంకు చెందిన ఆరుగురు వలస కూలీలు కడలూరు జిల్లాలోని ఓ జీడిపప్పు ప్రాసెసింగ్ కంపెనీలో పని చేస్తున్నారు. అస్సాంలోని కరీంకంచ్ జిల్లాకు చెందిన సజాస్‌నాధ్(45), శంకర్ నాధ్ అలియాస్ బిశ్వనాధ్(25) రత్తపడి జిల్లాకు చెందిన నరేంద్ర పీస్నప్‌(25)ని ఏడిపిస్తుండేవారు. తమ కంటే ఎక్కువ తింటూ తక్కువ పనిచేస్తున్నావంటూ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయిన నరేంద్ర దారుణానికి పాల్పడ్డాడు.

Also Read:

తాము అద్దెకు ఉంటున్న ఇంటిలోని మొదటి అంతస్తులో ముగ్గురు నిద్రించారు. ఉదయం ఆరు గంటలకే నిద్రలేచిన నరేంద్ర పక్కనే నిద్రపోతున్న సజాస్‌నాధ్, శంకర్‌నాధ్‌ తలపై ఇనుప రాడ్డుతో విచక్షనా రహితంగా దాడి చేశాడు. ఇద్దరినీ దారుణంగా కొట్టడంతో సజాస్‌నాధ్ స్పృహ‌ కోల్పోయాడు. శంకర్‌నాధ్ పెద్దగా కేకలు వేయడంతో మిగిలిన కూలీలు గమనించి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు సజాస్‌నాధ్ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన శంకర్‌నాధ్‌ని మెరుగైన వైద్యం కోసం తరలించారు. విషయం తెలుసుకున్న కదంపులియూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు నరేంద్రని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here