మాట వినని భార్య.. మనస్థాపంతో ఉరేసుకున్న భర్త.. ప్రకాశం జిల్లాలో విషాదం

భార్య మాట వినడం లేదని మనస్థాపం చెందిన భర్త ఉరేసుకుని చేసుకున్న విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మండలంలోని ముండ్లపాడుకి చెందిన నాగేంద్రరెడ్డి(31)కి వెల్లుపల్లె గ్రామానికి చెందిన భార్గవితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవల స్వగ్రామం ముండ్లపాడు నుంచి వెల్లుపల్లె వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు.

లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక పోవడంతో స్వగ్రామం వెళ్లిపోదామని భర్త నాగేంద్రరెడ్డి చెబుతూ వస్తున్నాడు. అయితే అందుకు భార్గవి నిరాకరించింది. తాను ముండ్లపాడు రానని తెగేసి చెప్పింది. భార్య తన మాట వినడం లేదని మనస్థాపానికి గురైన భర్త నాగేంద్రరెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here