పెద్దన్న పాత్ర పోషించండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

భా రత్ కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరుపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విశ్వమానవాళి రక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చొరవతో దేశ ఖ్యాతి మరింత ఇనుమడించింది. ఈ నేపథ్యంలో కీలక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన సంకేతాలు అందుతున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ చొరవ తీసుకోవాలని, పెద్దన్న పాత్ర పోషించాలని అగ్రరాజ్యం కోరింది. భారత్ చొరవతో అఫ్గాన్‌లో శాంతి స్థాపన నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

అఫ్గానిస్థాన్‌ రాజకీయ సంక్షోభం, ఆ దేశంలో శాంతి స్థాపన అంశాలపై గురువారం (మే 7) న్యూ ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్‌తో యూఎస్ ప్రత్యేక రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ భేటీ అయినట్లు సమాచారం. అఫ్గానిస్థాన్‌లో వివిధ రాజకీయ సమీకరణాల ద్వారా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, శాంతి స్థాపనకు గల అవకాశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Don’t Miss:

అఫ్గాన్ శాంతి స్థాపన భారత్ వల్ల సాధ్యమవుతుందని అమెరికా భావించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. భారత్ ఇప్పటికే అఫ్గానిస్థాన్‌కు ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో 5 వేల టన్నుల గోధుమలను ఆ దేశానికి అందించినట్లు సమాచారం. అఫ్గాన్‌కు మొత్తం 75 వేల టన్నుల గోధుమలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన చాహ్‌బహార్ పోర్టు ద్వారా వీటిని తరలిస్తోంది.

అటు అఫ్గానిస్థాన్‌ దేశానికి కూడా భారత్‌పై అభిమానం, విశ్వాసం ఉంది. తాలిబన్లు కూడా భారత్ చెబితే వింటారని, ఒప్పించే సామర్థ్యం భారత్‌కు ఉందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి స్థాపనకు మరింత చొరవ తీసుకోవాలని భారత్‌ను అమెరికా కోరుతోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here