మొహమాటమే కొంపముంచిందా.. బెంగాల్ కరోనా మరణాలకు కారణమేంటి?

ప శ్చిమ బెంగాల్‌లో కరోనా మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా బెంగాల్‌లో కరోనా మరణాల రేటు 9.75 శాతంగా ఉంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు 2 నుంచి 3 మధ్య ఉంది. కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. అక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలు ట్రాకింగ్ వరకు పలు అంశాలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. బెంగాల్‌కు ఏమైంది? అక్కడ మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉంది? ఈ ప్రశ్నలకు వైద్య నిపుణులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

దేశంలో కరోనా మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు ఆ రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. బృందానికి నేతృత్వం వహించిన అపూర్వ చంద్ర.. రాష్ట్ర సీఎస్‌ రాజీవ సిన్హాకి తమ పరిశీలన అంశాలను లేఖ ద్వారా వివరించారు. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 12.8 (కేంద్ర బృందం నాటికి) శాతంగా ఉందని తెలిపారు. తక్కువ సంఖ్యలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, బలహీనమైన పర్యవేక్షణ, ట్రాకింగ్‌ వ్యవస్థను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వ్యాప్తి అంశంపై ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో విపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించాయి. మెడికల్ బులెటిన్లలో రాష్ట్రం నివేదించిన కేసుల సంఖ్య, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కరోనా కేసులను దాస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.

Must Read:

అయితే.. బెంగాల్‌లో కేసులు తక్కువగా నమోదవడానికి పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ప్రజల్లో నెలకొన్న అపోహలు కూడా కారణమని చెబుతున్నారు. బెంగాల్‌లో ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. కరోనా వ్యాధి బారిన పడటాన్ని ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారని.. వ్యాధిగ్రస్థులను వెలివేసినట్లుగా చూస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇంట్లోనే ఉండటం మేలని భావిస్తున్నారని.. ఈ కారణంగా ఆరోగ్యం విషమించి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్‌ దీప్తేంద్ర సర్కార్‌ అభిప్రాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం (మే 8) నాటికి 92 పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. కరోనాతో మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1101కి, మరణాల సంఖ్య 151కి చేరుకుంది. బెంగాల్‌లో మొత్తం 23 జిల్లాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉండే జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 80 శాతం కేసులు రెడ్‌ జోన్‌గా ప్రకటించిన 4 జిల్లాల్లోనే నమోదవడం గమనార్హం.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here