లాక్‌డౌన్‌తో కరోనా విజృంభణ తప్పింది.. హైదరాబాద్‌కు కేంద్ర బృందం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రభావంతో డబులింగ్ రేట్ నెమ్మదిగా ఉందని తెలిపింది. లాక్‌డౌన్ విధించడానికి ముందు 3.4 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కాగా.. ప్రస్తుతం కేసులు రెట్టింపు కావడానికి పది రోజులు పడుతోందని తెలిపింది. సరైన సమయంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని.. ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడగలిగామని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా కరోనా విజృంభించే ముప్పు తప్పిందని, కేసులు వేగంగా పెరగకుండా చూడగలిగామని ఆయన చెప్పారు.

గత 28 రోజుల్లో 15 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని ఆయన చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో 1684 కొత్త కేసులు నమోదు అయ్యాయని.. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 23,077కు చేరిందన్నారు.

ఇప్పటి వరకూ భారత్‌లో కోవిడ్ కారణంగా 718 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మన దేశంలో కరోనా రికవరీ రేటు 20.57 శాతంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ 4078 మంది కరోనానను జయించారని తెలిపారు. గత 24 గంటల్లో 491 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్రం తెలిపింది.

ఇండోర్‌లో లాక్‌డౌన్ మార్గదర్శలకాల విషయాన్ని పరిశీలించిన రెండు ఇంటర్ మినిస్టిరియల్ టీమ్‌లు నివేదిక సమర్పించాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై నగరాల్లో పరిస్థితిని సమీక్షించడానికి మరో నాలుగు ఇంటర్ మినిస్టిరియల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని కేంద్రం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here