ఇంట్లో ఒంటరిగా పదేళ్ల బాలిక.. గుంటూరు జిల్లాలో దారుణం

ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధులకు భయం కలగడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. పశువుల్లా మీద పడి అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. పదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన అత్యంత దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన బాలిక(10)ను దారుణంగా రేప్ చేశాడో కామాంధుడు. తల్లి పొలం వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తున్న బాలికపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి మరియానందం(51) కన్నేశాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై పడి పశువాంఛ తీర్చుకున్నాడు.

Also Read:

పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లికి విషయం తెలిసి షాక్‌కి గురైంది. వెంటనే తేరుకుని బిడ్డపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here