రాపిడ్ టెస్టింగ్ కిట్ల వాడ‌కాన్ని నిలిపేశాం: హైకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ

క‌రోనా వైర‌స్ రాపిడ్ టెస్టింగ్ కిట్ల వాడ‌కాన్ని నిలిపేశామ‌ని బొంబాయి హైకోర్టుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధాన‌మిచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో కిట్ల వాడకంపై సందేహాలు నెల‌కొన‌డంతోపాటు, త‌ప్పుడు రిపోర్టులు చూపించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని నాగ్‌పూర్ బెంచ్‌కు తెలిపింది. కోవిడ్‌-19కు సంబంధించి కిట్ల సేక‌ర‌ణ పూర్త‌య్యింద‌ని, ప్ర‌స్తుతం వీటిని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో భ‌ద్ర‌ప‌ర్చామ‌ని సహాయ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ యూఎం ఔరంగాబాద్క‌ర్‌.. హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రాల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తే వీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపింది.

Must Read:

మ‌రోవైపు ఈ కిట్ల‌ను క‌రోనా వైర‌స్ ప‌ర్య‌వేక్ష‌ణ కోస‌మే వాడుతున్నామ‌ని, వైర‌స్ రీసెర్చ్‌, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌లో వాడ‌టం లేద‌ని ఔరంగాబాద్క‌ర్ తెలిపారు. మ‌రోవైపు ఇప్ప‌టికే రాపిడ్‌ టెస్టింగ్ కిట్ల‌ను వాడ‌కూడ‌ద‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Must Read:

వివిధ రాష్ట్రాల నుంచి ఈ కిట్ల ప‌నితీరుపై ఫిర్యాదులు వ‌స్తుండ‌టంతో ఐసీఎంఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై మూడు రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని కౌన్సిల్ అధికారి డా.రామ‌న్ గంగాఖేడ్క‌ర్ తెలిపారు. రాపిడ్ టెస్టులు, ఆర్టీ పీసీఆర్ కిట్ల ఫలితాల‌లో చాలా వ్యత్యాసం క‌న్పిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు 23000కుపైగా చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు 718 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here