ఎన్నారై కొడుకుని కత్తితో పొడిచి.. డబ్బు కోసం కన్నతండ్రి ఘాతుకం

డబ్బు మాయలో మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. తరతమ భేదం లేకుండా డబ్బుల కోసం దారుణాలకు తెగబడుతున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని ఒక్కగానొక్క కొడుకుని కన్నతండ్రే పొడిచి చంపేసిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. తన డబ్బులు ఇవ్వకుండా కొడుకు ఎక్కడ దేశం దాటిపోతాడోనన్న అనుమానంతో గొడవపడి చివరకు చంపేశాడు దుర్మార్గుడు. ఈ అమానుష ఘటన గుజరాత్‌లోని జిల్లాలో చోటుచేసుకుంది.

రని తల్వి ప్రాంతంలోని బర్బంద్‌వాడ్‌కి చెందిన అబ్దుల్ హమీద్ మనియార్‌కి ఒక్కాగానొక్క కొడుకు ఇమ్రాన్(36) సంతానం. పదేళ్ల కిందట లండన్ వెళ్లిన ఇమ్రాన్ అక్కడే స్థిరపడ్డాడు. ఇటీవల భార్య, కొడుకుతో కలసి స్వగ్రామానికి వచ్చాడు. తన సొంతూరులో ఉన్న ఇంటిని బాగు చేయించేందుకు తండ్రి హమీద్ వద్ద లక్షా 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.

Also Read:

నెల రోజులు ఇక్కడే ఉండి ఇంటిని బాగు చేయించాడు. యూకే పౌరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో లండన్ వెళ్లాల్సి ఉంది. ఆ విషయం తండ్రికి తెలియడంతో తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కొడుకుని అడిగాడు. ఇళ్లు బాగు చేయించేందుకు తన స్నేహితుల వద్ద కూడా అప్పు తీసుకున్నానని.. వాళ్ల అప్పు తిరిగి ఇచ్చేసిన తరువాత ఇస్తానని తండ్రికి చెప్పాడు. అప్పటి వరకు ఇంటిలో పోర్షన్ అద్దెకు ఇచ్చి డబ్బు వసూలు చేసుకోవాలని సూచించాడు.

Read Also:

అయితే ఆ ప్రతిపాదన తండ్రి హమీద్‌కి నచ్చలేదు. తన గదిలోకి వెళ్లి భార్య షంసున్నీసాతో గొడవపడ్డాడు. ఆ గొడవ విన్న కొడుకు ఇమ్రాన్ తండ్రి గదిలోకి వెళ్లడంతో వివాదం ముదిరింది. ఇద్దరూ బాహాబాహీకి దిగారు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి హమీద్ కొడుకు ఇమ్రాన్‌ని కత్తితో పొడిచేశాడు. భుజంపై, చేతి కింద భాగంలో బలంగా పొడవడంతో కొడుకు కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడిపోయిన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here