విశాఖ నగరంలో చేపట్టిన పైప్లైన్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ క్రేన్ ఆపరేటర్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో పైపు లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. పైపులు ఏర్పాటు చేసేందుకు క్రేన్ వినియోగిస్తున్నారు.
నరవ వద్ద పైపును పైకి ఎత్తే క్రమంలో క్రేన్ హైటెన్షన్ విద్యుత్ లైన్ కు తగిలింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్రేన్ దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: