వరంగల్ లోని కాజీ పేట లో ఫాతిమా నగర్ బ్రిడ్జ్ దగ్గర దారుణం జరిగింది. బస్సు లోంచి కింద పడిపోయిన ఒక యువకుడు తీవ్ర గాయాలతో రోడ్డున పడ్డాడు, అతని ఆర్తనాదాలు గట్టిగట్టిగా వినిపించాయి. అక్కడికి చేరుకున్న అతని తల్లి ఆ దృశ్యాన్ని చూసి ఏడవడం మొదలు పెట్టింది. తన కళ్ళ ముందరే కుమారుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెట్టింది.
విక్రం అనే కుర్రాడు తన ఉద్యోగానికి బైక్ మీద వెళ్తున్నాడు, దారిలో ఒక బ్రిడ్జ్ దిగుతున్న టైం లో అతన్ని బస్సు గుద్దేసింది అతను రోడ్డు మీద పడిపోగా బస్సు అతని మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జరిగిన దగ్గరలోనే అతని తల్లి ఉంది, అంబులెన్స్ కూడా ఇరవై నిమిషాల తరవాత కానీ రాలేదు. తన కొడుకుని కాపాడాలంటూ ఆ తల్లి దీనంగా అడుగిన తీరు అందర్నీ కదిలించింది. అంబులెన్స్ లోనే విక్రమ్ కన్నుమూశాడు.