మహారాష్ట్ర జిల్లా పరతూర్ లో ఒక పెళ్లి వేడుక వింతగా జరిగింది. స్మశానం లోకి వెళ్ళిన జంట బంధువులు అందరూ ఆ జంట ని చూసి మురిసిపోయారు. మంజు శ్రీ , ఆకాష్ అనే వధువు వరులని దీవించారు అందరూ. ఈ పెళ్లి అందరికీ ఆదర్శ వివాహం అంటూ పొగిడేశారు అందరూ. వారి పెళ్లి అందరికీ ఒక సందేశం లా ఉండాలి అనే ఉద్దేశ్యం తో వారు తమ పెళ్లి ని వింతగా చేసుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండాలని, మూఢనమ్మకాలపై అవగాహన పెంచుకొని వాటిని తరిమేయాలని సందేశమివ్వడానికే ఇలా శ్మశానంలో పెళ్లి చేసుకున్నారు.
శ్మశానవాటిక లో అంత్యక్రియలు చేసే మానస్ జోగి (తనొక కాటి కాపరి) వర్గానికి చెందిన సుభాష్ గైక్వాడ్ కూతురిని మనస్ కి ఇచ్చారు. ఈ పెళ్లి కోసం కుంఠధామ్ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించి, అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేసి మరీ పెళ్లి జరిపించారు.