బైకుల కోసం షో రూమ్ ల నిండా జనాలు

సుప్రీం కోర్టు నిభంధనల అనుగుణంగా లేని భారత్ ఏమిషన్స్ 3 లేని కంపెనీల వాహనాలు అన్నీ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచీ నిషేధం లో ఉంటాయి. హీరో మోటో , హోండా , బజాజ్ , సుజుకి ఇతర కంపెనీలు ఎప్పుడూ కనీ వినీ ఎరుగని డిస్కౌంట్ లని ప్రకటించాయి. దెబ్బతో షో రూమ్ లు అన్నీ కిట కిట లాడిపోతున్నాయి. ఆ ఆఫర్ లు అన్నీ భారీగా ఉండడం ఇవాళ ఒక్క రోజు మాత్రమే ఆ అవకాశం ఉండడం తో అందరూ బైక్ లు తెగ కొనేస్తున్నారు.

స్టాక్ ముగిసే వరకూ మాత్రమే ఈ ఆఫర్ ని ఇవ్వగలం అని ప్రకటనలు జారీ చేస్తూ ఉండడం తో షో రూమ్ లలో గుట్టలు గుట్టలు డబ్బులు పోసి మరీ బైక్ లు కొంటున్నారు జనాలు. తమ దగ్గర ఉన్న నిల్వ బైక్ లు అన్నీ ఇవాళ లోగా అమ్మినట్టు చూపించక పోతే దెబ్బకి రేపటి నుంచీ అవి పనికి రాకుండా పోతాయి దాంతో అందరూ హడావిడి పడుతున్నారు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300కు పైగా వివిధ కంపెనీల డీలర్ షిప్ కేంద్రాలు ఉండగా, ఇరవై ఏడు వేల వాహనాలు ఈ ప్రాంతం లో మాత్రమే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here