సరిగ్గా ఇదే టైం లో పోయిన ఏడాది జరిగిన లక్నో ర్యాలీ లో నరేంద్ర మోడీ ని మర్డర్ చెయ్యడం కోసం రాం లీలా మైదానం లో ప్రయత్నం చేసినట్టు ఉగ్రవాదులు నుంచి సమాచారం ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ చెబుతోంది. మధ్య ప్రదేశ్ లో ఉజ్జయిన్ పాసింజర్ రైలు లో పేలుడు జరిపిన అదే ఉగ్రవాదుల బృందం మోడీ ని హత్య చెయ్యడం కోసం చాలా ప్రయత్నాలు చేసారు అని అధికారులు మీడియా కి చెబుతున్నారు.
పోలీసులు అరస్ట్ చేసిన ఒక ఉగ్రవాది మహమ్మద్ డానిష్ , ఆతిఫ్ ముజఫర్ ఇద్దరినీ విచారిస్తూ ఉన్న టైం లో రాం లీలా మైదానం లో దసరా ఉత్సవాలకి ఒక రోజు ముందర అక్కడ ఉన్న చెత్త డబ్బా లో బాంబు పెట్టారు అనీ ఆ రెండు రోజుల తరవాత బాంబు ల్లేదు కానీ వైర్లు మాత్రమే ఉన్నాయి అని అతను చెప్పినట్టు తెలుస్తోంది .. ఆ తరవాత ఈ ఉగ్రవాది చాలా చోట్ల బాంబులు నాటాలి అని ప్రయత్నం చేసినా వర్క్ అవ్వలేదట.వీరు స్టీలు పైపులు, షాండ్లియర్ బల్బులను వాడి బాంబులు చేశారని విచారణ లో తేలింది.