హైదరాబాదు నగరంలో దొంగలు చెలరేగిపోయారు సంక్రాంతి సందర్భంగా చాలామంది తమ బంధువుల ఇంటికి పుట్టింటికి సొంత ఊర్లో వెళ్లే వాళ్లు కొందరైతే, పండగ సందర్భంగా కొంతమంది సినిమాలకు వెళ్లేవారు మరికొంతమంది. ఈ క్రమంలో దొంగలు అదునుచూసి హైదరాబాదు నగరంలో రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సాయిబాబా కాలనీలో ఏకంగా ఐదు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి.
రెండు కుటుంబాలు పండగ నిమిత్తం ఊరు వెళ్లగా .మరో మూడు కుటుంబాలు సినిమాకు వెళ్లడం జరిగింది. చివరికి సినిమా నుండి వచ్చేసరికి తమ ఇల్లు దొంగతనానికి గురైంది అని గుర్తించారు. దొంగలు తాళాలను పగులగొట్టి 40 తులాల బంగారాన్ని, దొరికినంత నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.