బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, ప్రముఖ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కలిసి దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో నటించిన ‘పద్మావతి’అనేక సంచలనాలు, వివాదాలు సృష్టించింది దేశంలో. అప్పట్లో కొందరు ఈ సినిమా ను విమర్శించేవారు ఏకంగా దీపికా పదుకునే తల నరుకుతామని బెదిరించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా అనేక వివాదాలను అడ్డంకులను దాటుకుని ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఇన్ని వివాదాలకు కారణమైన ఈ సినిమా తమ రాష్ట్రాల్లో విడుదల చెయ్యనివ్వం అని అప్పట్లో పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు అనడం జరిగింది.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ అసహనం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అని చెప్పడానికి తానేం జ్యోతిష్యుడిని కానని యోగి ఆదిత్యనాథ్ సమాధానం ఇచ్చారు. కాగా, తన సినిమా విడుదల విషయమై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దర్శకుడు భన్సాలీ చర్చించనున్నారు.