హీరో సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమాకు పైరసి సేగా తగిలింది.ఈ క్రమంలో జవాన్ సినిమా నిర్మాత అయినా కే .కృష్ణయ్యను కొందరు దుండగులు బెదిరించారు.సినిమాకు విడుదలకు ముందు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ చౌదరి, ప్రభాకర్ చౌదరి, నాగ్ పూర్ నివాసి యార్లగడ్డ విజయ్ లు కృష్ణయ్యను కలిశారు.
మాకు కావలసినంత డబ్బు ఇస్తే జవాన్ సినిమాను పైరసీ నుండి కాపాడతామని,ఇంటర్ నెట్ లో అప్ లోడ్ అవ్వకుండా చూస్తామని చెప్పారు.దీనికి నిర్మాత కె.కృష్ణయ్య ఒపుకోకపోవడం తో బ్లాక్ మెయిల్ కు దిగారు . ఈ నేపథ్యంలో, వీరిపై సీసీఎస్ పోలీసులకు నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, నిందితులను హైదరాబాదులోని యూసఫ్ గూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు.