టాలీవుడ్ ప్రస్తుత తరం హీరోలలో రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఇండస్ట్రీ లో తెచ్చుకున్నాడు.గతంలో అయన సూర్య ప్రతాప్ దర్శకత్వం లో నటించిన సినిమా ‘కుమారి 21 F’ భారీ విజయాన్ని చూసింది.ఈ సినిమా తరువాత దర్శకుడు సూర్య ప్రతాప్ చాల గ్యాప్ తీసుకున్నాడు మధ్యలో ఏ సినిమా చేయలేదు.
గ్యాప్ కు కారణం సరైన కథ దొరకకపోవడం.అయితే తాజాగా ఒక అద్భుతమైన కథ తో రెడి అయిపోయాడు సూర్య ప్రతాప్ .ఈ సినిమాలో హీరోగా మళ్ళి రాజ్ తరుణ్ ను ఎంపిక చేసుకున్నాడు.ఈ సినిమాకి నిర్మాతగా రామ్ తాళ్లూరి బాద్యతలు చేపటబోతున్నాడు. ఈ సినిమా కు సంబంధించి షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.