భారత దేశం లో మరొక ముంబై తాజ్ హోటల్ తరహా దాడికి అంతా సిద్దమయ్యిందా ? పాకిస్తాన్ కేంద్రం గానడుస్తున్న లష్కరే తోయిబా కి చెందిన దాదాపు పాతికమంది ఉగ్రవాదులు దేశం లోకి దూరారు అంటున్నాయి నిఘా వర్గాలు. సరిహద్దు పట్టణాలు లేదా దేశం లో మరేదైనా మెట్రో నగరం లో అత్యంత పెద్ద దాడికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, టూరిస్టు ప్రాంతాలు, మాల్స్, హోటళ్లను వీరు టార్గెట్ గా చేసుకోవచ్చని భావిస్తున్నామని అన్నారు. విమానాశ్రయాల దగ్గర నుంచి ప్రధాన రైల్వే స్టేషన్ లు , బస్ స్టాండ్ ల దగ్గర భారీ భద్రత పెంచారు. అన్ని నగరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ అయ్యాయి .