దాసరి నారాయణరావు ఆఖరి చూపుకి వేలాది మంది జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం కి చేరుకున్నారు అక్కడ నుంచి ఆయన పార్తవ దేహం తరలించే క్రమం లో మోహన్ బాబు అనేక సూచనలు చెయ్యడం కనపడింది. మోహన్ బాబు – దాసరి ల మధ్యన సాన్నిత్యం గురించి అందరికీ తెలిసిందే. దాసరిని మొయ్యాల్సింది ఎవరో వారి పేర్లు మోహన్ బాబు ప్రకటించి మధ్యలో మరొక ఇద్దరు పట్టుకోవచ్చు అని తెలిపారు బాబు. ” ఆ ఆరుగురు తప్ప దాసరి గారిని ఎవ్వరూ తాకకూడదు. మనం నేరుగా గుడి కి వెళ్తాం. అక్కడ నీళ్ళు చల్లి కింద పెడతాం.
కంగారు ఏమీ లేదు గోవింద నామం చెబుతూ నెమ్మదిగా వెళదాం. ” అన్నారు మోహన్ బాబు. ముందు పోలీసు బ్యాండ్ సాగుతుండగా, ఆ వెనుక వేలాది మంది అభిమానులు, ప్రముఖులు దాసరి వెంట కదిలారు. ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో దాసరి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు.