ప్రతీ రోజూ భక్తుల తో కిటకిట లాడే తిరుమల రోడ్లూ , కొండలూ ఇప్పుడు ఖాళీగా మారాయి. ఇవాళ ఉదయం క్యూ కాంప్లెక్స్ లలో కేవలం రెండే రెండు కంపార్ట్మెంట్ లలో భక్తులు కనిపించారు. మిగితా కంపార్ట్మెంట్ లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉదయం 11 లోగా దర్శనం పూర్తి చేసుకున్నారు అందరూ. నడక దారి లో వచ్చిన వారికీ, ప్రత్యేక ప్రవేశ దర్సనం భక్తులకీ గంట కంటే తక్కువ టైం లోనే దర్సనం లభిస్తోంది.
మండుతున్న ఎండలు ఓ వైపు, విద్యాలయాలకు ఇంకా సెలవులు మొదలు కాకపోవడంతోనే భక్తుల రాక తగ్గిందని తెలుస్తోంది. తిరుపతి లోకల్ లో ఉండే భక్తులకి ఈ వార్త తెలియగానే క్యూ కాంప్లెక్స్ ఫ్రీ అవ్వడం తో వారు తమ కుటుంబాలతో దర్సనానికి వస్తూ ఉన్నారు. ఎవరూ లేని టైం లో తమ దర్సనం పూర్తి చేసుకుందాం అని వారి ప్లాన్