డిల్లీ లో జగన్ .. రాష్ట్రపతి , మోడీ తో భేటీ

ప్రజాస్వామ్యాన్ని సంరక్షించండి అంటూ వైకాపా అధినేత జగన్ చేపట్టిన కొత్త డిల్లీ యాత్ర ఇవాళ నుంచీ మొదలైంది. వైకాపా టికెట్ మీద గెలిచి రాజీనామాలు చేయకుండానే తెలుగుదేశం పార్టీ లో చేరి మంత్రులు అయిన వారి మీద ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ జగన్ చేస్తున్న దీక్ష ఇది. ఈ విషయం లోకల్ గా కాకుండా డిల్లీ లెవల్ లో ఒక పెద్ద విషయం గా చూపించాలి అనే ఆలోచన తో జగన్ డిల్లీ బయలుదేరారు. మొదట నుంచీ జరిగినది మొట్ట రాష్ట్రపతి తో పాటు ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకుని వెళ్లి ఫిరాయింపులు ఎంత దారుణం అని చెప్పబోతున్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగుతోంది. ఇవాళ మధ్యాన్న రెండు గంటలకి రాష్ట్రపతి ని కలిసిన జగన్ మొత్తం తమ ఇబ్బందులు , తెలుగు దేశం డబ్బులు విసిరి ఎమ్మెల్యే లని ఎలా కొంటోంది అనేది కిల్యర్ గా వివరించారు. పార్లమెంటు లో అన్ని పక్షాల నేతలనీ జగన్ బృందం కలుస్తుంది. దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న జగన్, పలువురు కేంద్ర మంత్రులు సహా, ముఖ్య నేతలను కలుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here