ఆంధ్రా ఊటీ.. అరకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే.. ఏ మాత్రం వీలు చిక్కినా.. అరకు అందాలు ఆస్వాదించేందుకు జనం వేల సంఖ్యలో నిత్యం వెళ్తుంటారు. మధ్యలో జలపాతాలు.. గుహలు కొలువై ఉన్న ప్రకృతి అందాలను కూడా టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు.
ఇప్పుడు.. టూరిస్టులను మరింత ఆకర్షించేలా.. ప్రకృతి అందాలను మరింత అందగా దర్శించుకునేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. అద్దాల రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.
ఇవాళే.. ఆ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు.. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రారంభించారు. దీంతో.. అరకు పర్యాటకంగా మరింత ఆకర్షణీయం కానుంది.