రెండు రోజుల క్రితం నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. కేరళ లో ఒక పరిక్షా కేంద్రం లో పరీక్ష కోసం వెళ్ళిన ఒక అమ్మాయిని ఇద్దరు టీచర్ లు ఇబ్బంది పెట్టిన వైనం చూసాం. బ్రా ధరించింది అంటూ పరీక్ష రాయనివ్వలేదు. దీని మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వెంటనే ఆ నలుగురు టీచర్ లనీ సస్పెండ్ చేసింది.
బ్రా తీసేస్తే కానీ పరీక్ష రాయనీయం అని వారు అనడం తో సదరు విద్యార్థిని తనను అనుమతించకపోవడంతో, వెంటనే బయటకు వచ్చిన ఆమె తన టాప్ ఇన్నర్ వేర్ ను తన తల్లి చేతిలో పెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇది వీడియో , ఫోటో లతో సహా బయటకి రావడం తో నేషనల్ వైడ్ గా సంచలనం రేపింది. సోషల్ మీడియా లో వైరల్ అవడం తో ఆమె తరఫున సపోర్ట్ పెరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకుంది