కింగ్ అఫ్ యాక్ట్రస్స్ శ్రీ దేవి మరణం యావత్ సినీ ప్రపంచం షాక్ కి గురైంది. శ్రీదేవి మరణంతో దేశంలో ఉన్నన్ని ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో సినిమారంగంలో ఉన్న చాలామంది ప్రముఖులు శ్రీదేవి మృతిపట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కలక్షన్ కింగ్ విలక్షణ నటుడు మోహన్ బాబు శ్రీదేవి మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆయన వివరించారు.
శ్రీదేవి తల్లి తిరుపతికి చెందిన వారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించానని, భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు….ఓ ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయిందని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యము ఇవ్వాలని కోరుకున్నారు.