ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరొకసారి రెచ్చిపోయాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద. మొన్నా మధ్యన పవన్ కళ్యాణ్ అందరికీ క్షమాపణలు చెప్పి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే షాకింగ్ కామెంట్స్ చేసిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్… తాజాగా పవన్ కళ్యాణ్, అతని అభిమానులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు….అయితే ఈ క్రమంలో కత్తి పవన్ బలం బలహీనతల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బలం ఏమిటో తెలియదు కానీ బలహీనతలు మాత్రం తెలివి తక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులు .. వాళ్ళందరూ మైండ్ లెస్ ఫెలోస్ ..ప్రత్యేక హోదాపై పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళాలని పవన్ భావిస్తుంటే అతని ఫ్యాన్స్ మాత్రం తెలివితక్కువ తనంతో దానికి తూట్లు పొడుస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .
అయితే పవన్ రాజకీయంగా భూస్థాపితమవ్వడానికి ఫ్యాన్స్ చాలు అని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు ..కత్తి మహేశ్ చేసిన తాజా ట్విట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కట్టి ట్విట్ కి ఎలా రియాక్ట్ అవుతారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.