గత ఆరు సంవత్సరాల పాటు ఇండియన్ పెప్సీ బ్రాండ్ గి అంబాసడర్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆ సంస్థ కి ఇకపైన ప్రచారం చెయ్యకూడదు అని అతను నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు లో తాను ఏ ప్రోడక్ట్ అయితే వాడతానో దానికి మాత్రమె ప్రచారం చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇక పైన పెప్సీ తాను తాగను అనీ అందరికీ తాగమని కూడా చెప్పే ఉద్దేశమే లేదు అని కోహ్లీ చెప్పడం విశేషం. “అటువంటి పానీయాలను నేను తాగను. కేవలం డబ్బు కోసం వాటిని తాగాలని ఇతరులకు చెప్పలేను” అని సీఎన్ఎన్ – ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు.
” రాబోయే రోజుల్లో కూడా ఆ సంస్థ కి ఏ రకమైన ప్రమోషన్ ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ప్రస్తుతం కోహ్లీ టీ ట్వెంటీ లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ వన్డేల్లో వరల్డ్ నంబర్ త్రీగా, టెస్టుల్లో వరల్డ్ నంబర్ ఫైవ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్నేళ్ళు కోటానుకోట్లు పెప్సీ పేరు చెప్పుకుని గడించిన కోహ్లీ సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్ధం కావడం లేదు.