రవాణా , ట్రాఫిక్ కంట్రోల్ కోసం కడుతున్న మెట్రో ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుంటోంది. మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ వాసులకి పట్టపగలే ప్రాణాలు తీస్తోంది, రోడ్ల మీదకి వచ్చేలా నిర్మించిన కట్టడం , స్టేషన్ లు ట్రాఫిక్ ని తగ్గించడం లేదు సరికదా ఇంకా పెంచేస్తున్నాయి. రోడ్డు మధ్యలో వందలాది పిల్లర్లు వచ్చెయ్యడం తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది.
మెట్రో పిల్లర్లను వాహనదారులు ఢీకొడుతున్న ఘటనలు నిత్యకృత్యమైపోతున్నాయి. మొన్నటికి మొన్నే జూబ్లీ హిల్స్ లో ఏపీ మంత్రి నారాయణ కొడుకు చనిపోగా ఇప్పుడు మరొక పిల్ల మరొకరి ప్రాణం తీసింది. ఎల్బీనగర్ దగ్గరున్న మెట్రో పిల్లర్ ను ఓ డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ సర్దార్ అక్కడికక్కడే మృతి చెందాడు.