రూ.18కోట్లు సంపాదించాలంటే సామాన్యులకైతే ఓ నాలుగు తరలవారు సంపాదించడమే చాలా కష్టం. అలాంటిది ఇంటింటికి తిరిగా చాక్లెట్లు అమ్ముకునే వ్యక్తి అకౌంట్లో రూ.18కోట్లు నగదు డిపాజిట్ అయ్యింది.
పెద్దనోట్ల రద్దుతో ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖ డేగకన్న ఉంచింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న విచారణ చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు విజయవాడలో చాక్లెట్లు అమ్ముకునే వ్యాపారి కిషోర్ పై దృష్టిసారించారు. గతేడాది నుంచి కిషోర్ కు చెందిన రేణుకామాత కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అకౌంట్ పై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు.
గతేడాది నవంబర్ నుంచి విడతలవారీగా రూ.18కోట్ల ఈ అకౌంట్లో గతేడాది నవంబరులో విడతల వారీగా 18కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయింది. అయితే ఇటీవల ఈ లావాదేవీలను గుర్గించిన ఐటీ అధికారులు…. వారం రోజుల క్రితం కిషోర్ లాల్కు నోటీసులు జారీ చేశారు. ముంబై నుంచి కిషోర్ లాల్ అకౌంట్ కు నగదు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. కిశోర్లాల్ను బ్యాంకుకు తీసుకెళ్లి లావాదేవీల వివరాలు సేకరించారు. ఖాతా వివరాలు, చెక్ బుక్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే తనకు ఈ నగదు విషయం తెలియదని చెప్పిన కిషోర్ లాల్… తర్వాత రోజు నుంచి పరారీలో ఉన్నాడు. దీనితో అతని కోసం ప్రస్తుతం ఐటీ అధికారులు వేట మొదలెట్టారు. ఈ వ్యవహారంతో గతంలో ఉన్న మేనేజర్ కు సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో జరిగిన లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టిపెట్టడంతో ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి.