సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ వార్తల్లో నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా వర్మ తీసిన జియస్టి సినిమా అనేక వివాదాలకు చర్చలకు దారి తిసింది. వర్మ తీసిన GST షార్ట్ ఫిల్మ్ చాలామంది విభేదించిన వారు ఉన్నారు, అలాగే మద్దతు తెలిపిన వారు కూడా ఉన్నారు. అయితే విభేదించిన వారిలో కొంతమంది రాంగోపాల్ వర్మ మిద హాట్ హాట్ కామెంట్ చేయడం జరిగింది.
వర్మ కి సమాజంలో ఎటువంటి సినిమాలు తీయలో అర్థం కావని అన్న వారు కూడా ఉన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా వారికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు మరొకపక్క . అయితే తాజాగా జీయస్టీ సినిమా మీద సామాజిక కార్యకర్త దేవి గారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మిద ఘాటుగా స్పందించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ కూడా ఆమెకు గట్టి కౌంటర్ వేయడం జరిగింది. ఇప్పుడు రామ్ గోపాల వర్మ దేవీ మీద చేసిన కామెంట్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.
వర్మ మిద కేసు నమోదు అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. దేవి గారు వింటున్నారా అని వర్మ ఒక ట్వీట్ చేశాడు. తను తీసిన జీఎస్టీ గురించి ఒక పోల్ నిర్వహించాడు. అయితే వర్మ అభిప్రాయానికి దాదాపు 73% మద్దతు పలుకగా వర్మ ఆ విషయాన్ని తెలుపుతూ దేవిగారు వింటున్నారా అని ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.