టాలీవుడ్ సీనియర్ హీరో వై.సి.పి లో కి

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం వుండడంతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజకీయాలలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో ప్రముఖ నటుడు మోహన్ బాబు రాజకీయరంగంలో తిరిగి అడుగుపెట్టడానికి తెగ ఉత్సాహంగా ఉన్నారట. గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ లో ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఎంపీగా కొనసాగారు. రాజకీయాలలో అప్పట్లో మోహన్ బాబు ఎన్నో సంచలనాలు సృష్టించారు.

అయితే తాజాగా ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు మాట్లాడుతూ అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేయడానికి సిద్ధంగా ఉన్నాను .అది కూడా చిత్తూరు జిల్లాలో ఏదోక అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎందుకంటే  వైయస్ కుటుంబం ప్రజలకు మంచి చేసే కుటుంబం అని, పైగా వైయస్ జగన్ కూడా తండ్రి తగ్గట్టు ప్రజలకు మేలు చేస్తాడని మోహన్ బాబు తన అభిప్రాయాని వ్యక్తం చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆయన తెలిపారు.  మోహన్ బాబు చేరిక చిత్తూరు జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణలకు  దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here