33కోట్ల మంది దేవతలు కొలువై ఉన్న గోమాతను పూజించడం వల్ల మనకు సుఖసంతోషాలు వర్ధిల్లుతాయని చెప్పుకున్నాం. గోమాతే కాకుండా గోపంచకం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలాంటి ఫలితాల్లో ముఖ్యంగా గోపంచకాన్ని ఇంట్లో చల్లడం వల్ల దోషాలు తొలిగిపోతాయి. చికిత్సలో గోమూత్ర చికిత్సలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఒంట్లో ఉన్న రోగాలు, ఇంట్లో ఉన్న దోషాల్ని తొలగిస్తుంది. చెట్లు రాలిపోయి ఎండిపోతున్న గోపంచకం రాస్తే మళ్లి చిగురిస్తాయి.
అంతేకాదు ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మ అక్కడే ఉండకుండా తిరిగేందుకు గో పంచకాన్ని చల్లుతుంటాం. అదే గోమూత్రం, పేడవంటి సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల అనేక లాభాల్ని కలిగిస్తుంది. అలా గోమూత్రాన్ని పంచగవ్వ ప్రాసనముతో సేవించవచ్చు.