ఎవరికైనా తమ ఆరోగ్యంపై శద్ర కలిగితే మొదటి చేసే ప్రయత్నం రాత్రివేళల్లో గోదుమ పిండితో చపాతీలు తినడం . ముఖ్యంగా డయాబెటిస్, వయసు మీద పడిన వారు రాత్రైతే అన్నం ముట్టుకోకుండా చపాతీలతో మమ అనిపిస్తారు. దీనికి కారణం భారీ ఉబకాయం.
అయితే అన్నం కంటే గోదుమల్ని అరాయించుకోవడంలో చాలా సమస్యలుంటాయని తెలుస్తోంది. సెలియా డిసీజ్, వీట్(గోధుమ )అలెర్జీ, గ్లూటన్ సెన్సివిటీ లాంటి వ్యాధులతో శరీరం ఇబ్బందులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
గోదుమతో చేసిన రొట్టెలు తింటే తలనొప్పి, కడుపునొప్పిలాంటి సమస్యలు ఎదురవుతాయి. గోదుమల్లో గ్లూటెన్, గైటెన్ అనే ప్రొటీన్లు ఉంటాయని వాటి వల్ల మనకడుపులో గోదుమపిండి పేరుకుపోయి జీర్ణాశయ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు డైలీ రొట్టెలు తినడం వల్ల బక్కగా తయారవుతురాని సూచిస్తున్నారు. కాబట్టే పొట్టొస్తుందని గోదుమరొట్టెలు తినడం మానేసి ఉదయాన్నే నడవడం నేర్చుకోవాలని చెబుతున్నారు.