ఇండియా టీం కంటే టీం లో లేని గంబీర్ చాలా బెటర్ :

ఐపీఎల్ సీజన్ లో భారత క్రికెట్ జట్టు లో ఉన్న అందరు ఆటగాళ్ళూ ఆడుతూ ఉన్నారు , కానీ అత్యధిక పరుగులు మాత్రం జట్టు లో స్థానం లేని గౌతం గంభీర్ సాధిస్తూ ఉండడం గొడ్డలి పెట్టుగా మారింది. కోల్ కథా తరఫున తొమ్మిది మ్యాచ్ లు ఆడిన గంబీర్ 376 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతుండగా, భారత క్రికెట్ జట్టులోకి అతన్ని తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.  ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో ఇప్పుడు బ్రింగ్ బ్యాక్ జీజీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

దీనికి ఫుల్ సపోర్ట్ వస్తోంది. ఈ హ్యాష్ టాగ్ కి లైక్ లూ షేర్ లూ కూడా లక్షల్లో ఉన్నాయి. త్వరలో ఇంగ్లండులో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ ను తీసుకోవాలని ఆయన అభిమానులు బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి అభిమానుల మనసులని అర్ధం చేసుకుని అతని ఫార్మ్ ని చెక్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంటారో తీసుకోరో సెలెక్టర్ లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here