బ్యాక్ టూ కాలేజీ అనే అమ్మకాలలో భాగంగా ల్యాప్ టాప్ ల మీద భారీ డిస్కౌంట్ అందించ బోతోంది దేశీయ ఈ కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్ కార్ట్. ఏషర్ వన్ 10 ఆటమ్ టూ-ఇన్-వన్ ల్యాప్ ట్యాప్ ను రూ.9999కే అందించనున్నట్టు వెల్లడించింది. ఐ 3 ల్యాప్ టాప్ ని ఇరవై రెండు వేలకే ఇస్తూ దాని మీద కూడా మూడు వేల క్యాష్ బ్యాక్ ఇచ్చింది. గేమింగ్ ల్యాప్ టాప్ ని ఎక్స్చేంజ్ కోసం ఇస్తే ఇరవై వేల తగ్గింపు ఇచ్చ్చారు. ఎనభై రెండు వేల ధర ఉన్న ఐ ఫోన్ సెవన్ 128 జీబీ మీద 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఈ కంపెనీ. అరవై వేలకే ఈ ఐఫోన్ పొందవచ్చు.
ఐఫోన్ 7 (32 జీబీ) వేరియంట్ ధరను రూ. 60 వేల నుంచి రూ. 42,499కి తగ్గించామని తెలిపింది. మిగతా ఐఫోన్ మోడల్స్ పై కనీసం రూ. 2 వేల తగ్గింపు ఉంటుందని, ఈ ఆఫర్లు మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించింది.