విద్యార్ధిని పై హత్యాచార కేసులో అరెస్టైన పలహారి బాబా రాసలీలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఛత్తీస్ఘడ్కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఫలహారి బాబ అరాచకాల్ని బాధితురాలు ఎఫ్ ఐ ఆర్ లో పొందుపరిచింది. భక్తి ముసుగులో తనవద్దకు వచ్చే యువతులకు మాయామాటలు చెప్పేవాడని అలా తన నాలుకను నాకితే దైవానుగ్రహం పొంది మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారని నమ్మబలికేవాడు.
తన నాలుకపై తేనతో ఓం అనే బీజాక్షరం రాసి నాకమన్నాడని … నువ్వు అలా నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇదే రీతిలో జ్ఞానాన్ని ప్రసాదించాను.. నువ్వు కూడా పొందు’ అంటూ శృంగార బాబా తనతో చెప్పినట్లు అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
అంతేకాదు తాను బాబాను కలిసేందుకు ఓ గదిలోకి వెళ్లగా తలుపులేసి అత్యాచారం చేశాడని, దేవుడు చెప్పాడు కాబట్టే ఇలా చేసినట్లు బాబా తనతో అన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా చేసిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని , నిన్ను ఏకంగా జడ్జినే చేస్తానని బాబా తనతో చెప్పినట్లు బాధితురాలు తెలియజేసింది.