ప్రకాశం జిల్లా కి చెందిన వెంకటేశ్వరులు , లింగమ్మ దంపతులకి ఏకైక సంతానం దివ్య. గుంటూరు లోని ఒక ప్రైవేటు కాలేజీ హాస్ట లో ఆమె ఇంటర్ చదివింది. ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు అనే బాధ తో ఆమె పరీక్షల తరవాత రోజూ డల్ గా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత పరీక్షల రిజల్ట్స్ దగ్గరకి వచ్చే సరికి ఆమె భయం పెరుగుతూ వచ్చింది. రిజల్ట్స్ వస్తాయనడానికి కొన్ని గంటల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆపై నిన్న ప్రకటించిన ఫలితాల్లో దివ్య ఫస్ట్ క్లాసులో పాస్ అయింది.
పరీక్షలు రాసొచ్చినప్పటి నుంచి దివ్య ముభావంగా ఉందని, తీవ్ర మానసిక ఆవేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఆమె ఉత్తీర్ణురాలు అయ్యి కూడా చనిపోయింది అనే బాధ తో ఆ పాప తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. మరొక పక్క మంగళ గిరి లో ఫెయిల్ అయ్యాను అనే బాధ తో ఒక కుర్రాడు పెద్ద కోనేరు లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు