బ్యాంకు ఖాతాదారులకు షాకు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఖాతాదారుడు రూ. 50వేలు దాటి ట్రాన్సాక్షన్లు జరిగితే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ను తప్పని సరిచేసింది. వీటికి తోడు పాన్ కార్డకు, ఐటీ రిటన్స్ కు ఆధార్ ను అనుసందానం చేయాలని వెల్లడించింది. ఎవరైనా అలా చేయని పక్షంలో వారి బ్యాంక్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే
పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు ఆధార్ అనుసందానం చేయడాన్ని తప్పుబడుతు సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ప్రస్తుత నెలకొన్న భద్రత దృష్ట్యా తప్పని సరిగా ఆధార్ ను జతచేయాల్సిందేనని సూచించింది. ఎవరైతే ఈ యూనిక్ ఐడీని కలిగి ఉంటారో వారు పాన్ కార్డుకు దాన్ని లింక్ చేసుకోవాలని ,ఆధార్ కార్డు లేని వారి విషయంలో దీన్ని పట్టుబట్టరాదని పేర్కొంటూ సుప్రీం వెల్లడించింది. కాగా డిసెంబర్ 31,2017 లోగా బ్యాంక్ ఖాతా వినియోగదారులు తమ అకౌంట్లకు ఆధార్ ను అటాచ్ చేయాలని పేర్కొంది.