వైజాగ్ బెల్లం వినాయకుడితో కష్టాలు మటుమాయం

బొజ్జగణపతికి ఉండ్రాళ్లంటే ఇష్టం… వాటిని నైవేద్యంగా పెట్టిన వాళ్ల కోర్కెలు  తీరుస్తాడని అందరి నమ్మకం… కానీ వైజాగ్ లో కొలువై ఉన్న ఈ వినాయకుడికి ఉండ్రాళ్లు బదులు బెల్లాన్ని ప్రసాదంగా పెట్టి తమ మనస్సులోని కోరికల్ని స్వామి ముందు ఉంచి మోకాళ్లపై నిలబడి నమస్కరిస్తారు. ప్రతి బుధవారం బెల్లం వినాయకుడి ఆలయం…. భక్తులతో కిక్కిరిసిపోతుంది.

ఇలా బెల్లం పెట్టి పూజించడం వల్ల ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నా వాటినుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయాన్ని 11 శతాబ్దానికి పూర్వం…ఇదే ప్రదేశంలో ఆలయం ఉండేదని….చంద్రుడు స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ ప్రధాన ఆలయం…మహాశివుడిదే అయినా చిన్న ఆలయంగా ఉన్న ఆనంద గణపతి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆనంద గణపతి కంటే బెల్లం గణపతికి ప్రసిద్ధి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here